08/05/2026
*నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో అభివృద్ధి పనుల జాతరకు రంగం సిద్దం*
*17 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులు*
*15వ తేది ఉదయం 8గం॥లకు శంఖుస్ధాపన.*
*60 రోజుల్లో పూర్తి చేస్తాం.*
*శంఖుస్ధాపనలలో ఎక్కడికక్కడ స్ధానిక ప్రజలే శంఖుస్ధాపకులు.*
*తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్య అతిధులు.*
--------------------------------------
🔸నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.
🔸తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినతరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన మరియు అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 658 కోట్ల రూపాయలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸ఇందులో భాగంగా ఈ నెల 15వ తేది ఉదయం 8గం॥లకు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అదేరోజు, అదే సమయానికి మొత్తం 168 చోట్ల ఒకేసారి శంఖుస్ధాపనలు జరుగుతాయి. ఎక్కడికక్కడ ప్రజలే శంఖుస్ధాపకులు. తెలుగుదేశం, జనసేన, బిజేపి స్ధానిక నేతలే ముఖ్య అతిధులు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸ఇంతటి అభివృద్ధికి ఆశీస్సులు అందించిన రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత మరియు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అన్నిరకాలుగా సహకరిస్తున్న మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు ప్రత్యేక దన్యావాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸గత వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళాతీసినా తన అపార పరిపాలన అనుభవంతో ఈ వయసులో కూడా రాష్ట్ర ప్రజల కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇంఛార్జులు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్ పాల్గొన్నారు.