08/11/2022
#త్రాగునీటి సమస్య కలగకుండా చూడండి.
గుత్తదారులపై చర్యలు తీసుకోండి
ఎంపీడీవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ అభిషేక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం బీడివైఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు యం.తాహేర్ వలి, రామకృష్ణ మాట్లాడుతూ
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కుప్పగల్లు, బల్లేకల్లు, పాండవగల్లు, జాలిమంచి, గణేకల్లు, ఇస్వి ఈ ఆరు గ్రామాలకు త్రాగునీరు ప్రతిరోజు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుతం గుత్తాదారుల , ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ మధ్యకాలంలో మూడు నెలలుగా త్రాగునీటి సమస్య తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పైపులైన్ లీకేజీ అయినప్పుడు వెంటనే మరమ్మతులు చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మోటార్ రిపేర్ వచ్చినప్పుడు దానిని మరమ్మత్తులు చేసేంతవరకు ప్రత్యామ్నాయంగా మరో మోటార్ను నడపాల్సిన అవసరం ఉంది గుత్త దారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఒకే మోటార్ తో ఆరు గ్రామాలకు త్రాగునీరు పంపింగ్ అసాధ్యం అవుతుంది. రెండు మోటార్లు ఉన్నప్పటికీ ఒక మోటార్ చెడిపోయి ఉన్న మరో మోటార్ చెడిపోయేంతవరకు అధికారులు గుత్తదారులు నిర్లక్ష్యంగానే ఉన్నారు. వారిపై చర్యలు తీసుకొని ఆ గ్రామాల ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించండి.
1.సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించండి
2. ఒక భాగం గండిపడి ఉంది దాన్ని వెంటనే మరమ్మత్తులు చేయండి.
3. రెండవ అదనపు పైపులైన్ వేసి వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి.
4. నీటిని ప్రతిరోజు శుద్ధి చేసి పరాపరా అయ్యే విధంగా చర్యలు తీసుకోండి.
5.ప్రస్తుతం ఉన్న గుత్తదారులను తొలగించి వారి స్థానంలో బాధ్యతగా వ్యవహరించే వారిని నియమించండి.
ఈ కార్యక్రమంలో అంజనేయ, రామంజి, వీరేష్, లక్ష్మన్న, దస్తగీర్ ఇతరులు పాల్గొన్నారు.